దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్ కార్డు, ఆధార్కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి …
Read More »దళితబంధు దేశానికే పాఠం
తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …
Read More »ఏం నర్సయ్య బాగేనా.. సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఆప్యాయ పలుకరింపు
ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సర్పంచును ఆప్యాయంగా పలుకరించారు.కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్లో గురువారం రాత్రి బసచేసిన సీఎంను శుక్రవారం ఉదయం పలువురు మంత్రులు, అధికారులు కలిశారు. ఇదేసమయంలో మొగ్దుంపూర్ సర్పంచు జక్కం నర్సయ్య కలిసేందుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలుకరించారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా.. అంటూ కుటుంబసభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలకు పాల్పడితే ప్రజలు తన్నితరిమేస్తే.. వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. ఆయనేదో భారతదేశానికి ప్రధాని అయినట్టు ఫీలవుతున్నాడు. ఆయనెవరో.. ఆయన స్థాయి ఏందో.. బతుకు …
Read More »సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్
తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …
Read More »మలక్పేటలో నేడు 288 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..
మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అంతస్తుల్లో రూ. 24.91 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో మురికివాడగా ఉన్న పిల్లిగుడిసెలు బస్తీలో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …
Read More »చరణ్ మూవీలో జయరామ్
క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …
Read More »అనసూయ నక్క తోక తొక్కిందా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ను …
Read More »సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు
ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …
Read More »దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసలు
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరో వైపు కరోనా వల్ల 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ సంక్రమించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో …
Read More »