పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ వస్తుంది అంటే అభిమానులలో ఎంత ఆసక్తి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా పవన్ గళ్ల లుంగీ కట్టిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రానున్న అప్డేట్ ఏ రేంజ్లో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా, వారి అంచనాలును మించేలా ఇది ఉంది. కొద్ది సేపటి క్రితం …
Read More »ఆసరా పెన్షన్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స్వీకరణకు నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగస్టు 31వ తేదీ వరకు మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ను …
Read More »దళిత బంధు పథకం అందరికి వర్తింప చేస్తాం-మంత్రి తన్నీరు హరీష్ రావు
హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …
Read More »రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్లాక్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ …
Read More »నా వంటకు బలయ్యేది వారే!!
మిల్కీబ్యూటీ తమన్నాను ఇప్పటి వరకూ కథానాయికగానే చూశాం. నిజ జీవితంలో ఆమె ఎలా ఉంటారు? ఏం ఇష్టపడతారు? ఎలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలేవీ పెద్దగా బయటకు తెలీదు. తెర వెనక తమన్నా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే త్వరలో ప్రసారమయ్యే కుకింగ్ షో చూడాల్సిందే అంటున్నారు. దీని గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాల్లో నటించడం, డబ్బింగ్ చెప్పడం వేరు. ఓ ప్రాంతీయ కుకింగ్ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించడం …
Read More »యాదాద్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
Read More »రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూ అద్భుతం
తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాంతం. ఆర్థిక మంత్రి హరీశ్రావు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూను హరీశ్రావు తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద …
Read More »సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More »మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. …
Read More »దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,30,732 మృతిచెందారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 478 మంది మరణించగా, మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని …
Read More »