తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు తన జన్మదినం పురస్కరించుకొని లోటస్ పాండ్ లోని పార్కు వద్ద గౌరవనీయ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఖైర్తాబాద్ నియోజకవర్గ MLA దానం నాగేందర్ గారు, సినీ నటుడు తరుణ్ల …
Read More »కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ …
Read More »కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం
సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డికి మెడికల్ కాలేజీ : సీఎం కేసీఆర్
వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తర్వాత దశలో వచ్చే మెడికల్ కాలేజీల్లో మొదటిది కామారెడ్డిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి …
Read More »తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం : సీఎం శ్రీ కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …
Read More »తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు: ఎన్వీ రమణ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన …
Read More »జయశంకర్ సార్ ను స్మరించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తున్నాం. సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. కొత్త రాష్ట్రామైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే జయశంకర్ సార్ ఇచ్చే …
Read More »దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు
దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 88 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. ఇందులో 2,88,44,199 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 3,88,135 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ప్రొద్దున నుంచి ఇప్పటివరకు 1422 మంది చనిపోగా.. 78,190 …
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »ప్రొఫెసర్ జయశంకర్ కు మంత్రి పువ్వాడ నివాళులు
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఖమ్మం లో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, వారి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం కెసిఆర్ నాయకత్వంలో …
Read More »