కోడలిని హత్య చేసిన మామను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా తంబంపట్టి సమీపంలో ఉలిపురం నరికరడు ప్రాంతానికి చెందిన అరివళగన్ (45) ఒక కో–ఆపరేటివ్ సొసైటీలో సేల్స్ మన్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (40). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిళగన్ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళ్లిపోయాడు. అముద ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం అరివళగన్ తండ్రి పళని (63) ఇంటికి వచ్చాడు. తర్వాత …
Read More »హైదరాబాద్లో ఓ ఎస్ఐ… తల్లి బిడ్డతో అక్రమ సంబంధం
హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చీకటి వ్యవహారం వెలుగుచూసింది. ఓ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.5లక్షలు గుంజాడు. అంతేకాదు,ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి ఆ బాధిత యువతి షాక్ తిన్నది. తనకు న్యాయం జరుగుతుందనుకున్న మహిళ.. మరోసారి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో.. ఎస్ఐ …
Read More »నేడు కర్నూలులో సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …
Read More »బ్రేకింగ్ న్యూస్..నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఉదయం ఆరు గంటలకే
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష …
Read More »ఏపీలో ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’
కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. …
Read More »సీఎం కేసీఆర్కు ఏపీ సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ …
Read More »25 కిలోల వెన్నతో సీఎం కేసీఆర్ విగ్రహాం
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు హైదరాబాద్ ఎల్బీనగర్ ఎక్పెల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు కేసీఆర్ విగ్రహాన్ని టిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో తయారు చేశారు. ఎనిమిదిమంది ఐదు రోజుల నుంచి 25 కిలోల వెన్నతో విగ్రహాన్ని రూపొందించారు. ఎమ్మెల్సీ మల్లేశం, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి …
Read More »తలకు బలంగా తగిలిన బంతి.. మోకాళ్లపై కూలబడి విలవిల్లాడిన క్రికెటర్
త్వరలో జరుగనున్న టీ20 మహిళా వరల్డ్కప్లో భాగంగా ఓ వార్మప్ మ్యాచ్లో శ్రీలంక వుమెన్స్ క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను స్ట్రైచర్పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడ్డాయి. దీనిలో భాగంగా లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియా… దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ట్రయాన్ కొట్టిన బంతిని అంచనా వేయడంలో …
Read More »ప్రేమికుల రోజు రష్మిక ఎవరితో ఎక్కడికి వెళ్లిందో తెలుసా
హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్, సాండిల్వుడ్లో బిజీ హిరోయిన్గా మారారు. ఇటీవల సూపర్స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడంతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారారు. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలోనూ రష్మికా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తాజాగా హీరో …
Read More »