బంగాళాఖాతంలో తుఫాన్కు బుల్బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్బుల్ తుఫాన్కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో …
Read More »షాకింగ్..చంద్రబాబుకు సూడోలాజియా ఫెంటాస్టికా మానసిక రోగం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్ను నేనే కనిపెట్టా..సెల్ఫోన్ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని …
Read More »ఏపీ సీం జగన్ మరో సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలలో వైఎస్సార్ పెళ్ళి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లు విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తోన్న పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ. లక్ష వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి తర్వాత మసీదుల సంఖ్య …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన చంద్రబాబు
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ (పీఏసీ) పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థత గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య …
Read More »సముద్రస్నానంలో గల్లంతైన నలుగురు స్నేహితులు..ఆ కుటుంబాల్లో తీరని శోకం
కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్కు వచ్చిన ఆరుగురు ఇంటర్ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా …
Read More »నేను పవన్ కల్యాణ్కు వీరాభిమానిని..కాని.. మంత్రి అనిల్కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
వైసీపీలో దూకుడుగా వ్యవహరించే నేతల్లో మంత్రి అనిల్కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై సమయం దొరికితే పదునైన మాటలతో విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ తాజాగా ఓ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. తాను పవన్ కల్యాణ్కు వీరాభిమానిని అని, చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు పెద్ద ఫ్యాన్ని, ముఖ్యంగా పవన్ను పిచ్చిగా అభిమానించేవాడినని మంత్రి …
Read More »బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరతారా.? చర్చల కోసమే వెళ్లారా.?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావు ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కలిసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాసరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ ప్రాంతం నుంచి పలు పార్టీలకు సేవలందించారు. గంటా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గంట ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కి పరిమితం అయింది. ఈ క్రమంలో గంట …
Read More »ఉపాధి హామీ పనుల్లో రూ.2500 కోట్ల అవినీతి
ఏపీలో కేంద్ర ఉపాధి హామీ పనుల్లో రూ.2500కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను వైసీపీ ప్రభుత్వం వాడుకోవడం చట్ట విరుద్ధం. ఈ నిధులను కేవలం పులివెందుల,పుంగనూరు నియోజకవర్గాలకు వాడుకున్నారు అని ఆయన అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రంలో విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ పాలనలో జరిగిన పలు అవినీతి …
Read More »అయోధ్య కేసు తీర్పుపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడి సంచలన వ్యాఖ్యలు..!
అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమి హిందూవులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాలు మసీదు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ముస్లిం లా బోర్డు వంటి ముస్లిం సంస్థలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి. కాగా తాజాగా ఏ మొఘలు చక్రవర్తుల కాలంలో అయోధ్యలో …
Read More »