దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే
అచ్ఛేదిన్ కహా..? తిరోగమనంలోకి దేశం – ప్రధాని విధానాలు ప్రమాదకరం – నోట్లరద్దు నుంచి కోవిడ్-19 వరకు ప్రతిదీ విఫలమే – ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు …
Read More »చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే..లేచి తిరిగోచ్చాడు..
రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్య క్రియలు నిర్వహిస్తే వారం తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన ఘటన తాజాగా బయటపడింది. రాజ్సమంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన ఆర్కే హాస్పిటల్లో మరణించిన గోవర్దన్ ప్రజాపతి మ్రుతదేహాన్ని పొరపాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లారని విచారణలో తేలింది. వారిద్దరూ అదే దవాఖానలో చికిత్స పొందారు. అసలు కథేమిటంటే ఓంకార్ …
Read More »తమిళనాడు వ్యాప్తంగా 3000 పడకలను ఏర్పాటు చేసిన హైదరాబాద్ మేఘా సంస్థ
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ . తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్ ను, ఆస్పత్రులకు …
Read More »యువతకే ముప్పు ఎక్కువ
భారత్ ను సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో యువత ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. మే నెలలోని మొత్తం కేసుల్లోని దాదాపు 26 శాతం.. 18-30 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి. వీరి తర్వాత 31-40 ఏళ్ల వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. 18-44 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా.. టీకాల కొరతతోనే చాలా రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు.
Read More »బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఆ 5రాష్ట్రాల్లోనే
దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది. ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.
Read More »సీఎం స్టాలిన్ కు తలనొప్పిగా మారిన ఆ మంత్రి
తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »సీబీఐ కొత్త చీఫ్ సుబోధ్ జైస్వాల్ గురించి మీకోసం
సీబీఐ కొత్త చీఫ్ గా సుబోధ్ జైస్వాల్ ను నియమించింది కేంద్ర సర్కారు. ఆయన గురించి తెలియని విషయాలు మీకోసం.. 1962లో జన్మించిన సుబోధ్ జైస్వాల్ ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లో పనిచేశారు. రూ.20 వేల కోట్ల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల సమయంలో సీపీగా ఉన్నారు. మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. …
Read More »అసలు టూల్కిట్ రభస ఏమిటి?
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్కిట్ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్ హెడ్ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్టూల్కిట్ ఎక్స్పోజ్డ్’ హ్యాష్ట్యాగ్తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …
Read More »