Home / POLITICS (page 296)

POLITICS

ఆదిత్యానాధ్ సహా పలువురిపై కేసులు కొట్టివేసిన కోర్ట్.. ధర్మ విజేతగా జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆదిత్యనాథ్ పైన సీబీఐ మోపిన అభియోగాలని కొట్టి వేసింది. ఆదిత్యనాథ్‌ను సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఆదిత్యానాథ్ 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇండియా సిమెంట్‌కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు …

Read More »

యాదాద్రి పునరుద్ధరణ పనులు..సీఎం కేసీఆర్ కీలక సూచనలు..!!

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్ర్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం …

Read More »

కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచలన వాఖ్యలు..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో తాను జైలులో ఉన్నప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వీహెచ్ త‌ప్ప ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. ఈవిష‌యం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని ..సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలుస్తానన్నారు. ముఖ్యమంత్రి …

Read More »

అవినీతి మ‌ర‌క‌..కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌కు బేడీలు

క్షణం క్షణం ఉత్కంఠతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాయి కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు గ‌త ఏడాది చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి శిబిరాలు, సమావేశాలు, ప్రలోభాలు, ప్యాకేజీలు, ఆఫర్లు, ఆడియో టేప్‌లు లీక్… ఒక్కటేంటి ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగి జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి నాయ‌కుడి కర్ణాటక సీఎంగా జేడీఎస్‌ …

Read More »

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …

Read More »

మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్‌ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్‌ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …

Read More »

భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …

Read More »

కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటి అయ్యి టీడీపీ అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించిన జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …

Read More »

మరోసారి రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ చౌదరి

వివాదాస్పద దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చౌదరి మరోసారి దారుణంగా రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. నియోజకవర్గంలోని విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సాక్షిగా ఈ ఘటన జరిగింది. పింఛన్‌ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని రెచ్చిపోయారు. నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే …

Read More »

తిరుపతిలో కోలుకుంటున్న చెవిరెడ్డి.. ఆగ్రహంలో వైసీపీ శ్రేణులు

తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సిద్దా నాయక్‌ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించడం పట్ల చెవిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat