తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు కాసం బ్రదర్స్ అధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిపరిశీలించారు. నిర్వాహకులు ఓం నమః శివాయ ను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. మరింతగా ప్రజలకు చేరువై, మంచిగా …
Read More »కడారి అఖిల్ కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో నివాసముంటున్న మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మ ల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. గత కొద్ది కాలంగా అక్కడే సెటిల్ అయ్యారు. అయితే, 5 రోజుల క్రితం జెర్మనీ లోనే అఫీస్ పని పై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు …
Read More »ఎప్పటికే టీఆర్ఎస్సే ప్రజలకు శ్రీరామరక్ష: హరీశ్రావు
తెలంగాణకు మేలు చేసే టీఆర్ఎస్ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్ఎస్సే రాష్ట్ర ప్రజలకు …
Read More »తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్ అవ్వక తప్పదు: బొత్స
తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …
Read More »వందల ఎకరాలున్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు: కేటీఆర్
తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కోనాపూర్లో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ‘ మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో స్కూల్ …
Read More »తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా
‘అసని’ తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్ …
Read More »టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్: హరీశ్రావు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని తెలంగాణ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన …
Read More »పవన్.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి
2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »పొత్తులపై ప్రజల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు: సజ్జల
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …
Read More »