కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, సురేష్ రెడ్డి, కోలన్ …
Read More »ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాస్ క్రమశిక్షణాయుత జీవనశైలిని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంజాన్ పండుగ మానవసేవ చేయాలనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని.. లౌకికవాదం, మత సామరస్యంలో …
Read More »ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, వారి శ్రేయస్సు కోసం …
Read More »మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన ఈ …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్లో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »తీన్మార్ మల్లన్న బీజేపీని వదిలేసినట్లేనా?
బీజేపీ నుంచి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చేశాడా? ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ఘట్కేసర్ సమీపంలోని తన అనుచరులతో తీన్మార్మల్లన్న ఆదివారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలను మార్చేది తమ టీమ్ మాత్రమేనని.. అది బీజేపీ కన్నా లక్ష రెట్లు గొప్పదన్నారు. ఇకపై బీజేపీ ఆఫీస్కి వెళ్లనని ప్రకటించారు. మల్లన్న చేసిన ఈ కామెంట్స్ …
Read More »వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు
వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. …
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్లో మరో నూతన …
Read More »మైనారిటీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి అజయ్
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా …
Read More »మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్
కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎనిమిదేళ్ళుగా మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఆక్సిజన్ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని మంత్రి …
Read More »