తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలంలో తెరాస పార్టీ మండల …
Read More »భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి….
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …
Read More »తెలంగాణలో ప్రతి బడి పరిశుభ్రం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్బాగ్లోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్.. రాష్ట్రంలోని అన్ని …
Read More »ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి
ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య …
Read More »యాదాద్రిలో తెలంగాణ మంత్రులు
తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు.ఆలయ ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More »Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …
Read More »Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …
Read More »Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …
Read More »Hyderabad Drugs Case-4గురు అరెస్టు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …
Read More »కేంద్రంపై టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ప్రకటించిన కేటీఆర్
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రప్రభుత్వంపై మరింత గట్టిగా ఫైట్ చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్ ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని కేటీఆర్ చెప్పారు. ఈ యాసంగిలో …
Read More »