Classic Layout

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్‌ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు …

Read More »
ktr crticize on pm modi ruleS

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ సీరియస్

KTR: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం గతి పూర్తిగా దిగజారిపోయిందని ఐటీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. అసెంబ్లీ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో భారతదేశం అన్నిరంగాల్లోనూ ఎగబాకిందని ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం….మన దేశంలోనే నమోదయిందని అన్నారు. ద్రవ్యోల్బణంతోపాటు నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సిలెండర్ ధర మన దేశంలోనే ఉందని దుయ్యబట్టారు. 4వందల రూపాయల ఉన్న సిలిండర్‌ ధరను …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్‌ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్‌ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన …

Read More »

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో  రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు …

Read More »

మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ తమిళ సై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు శనివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ప్రతిపక్ష నాయకులంటూ మండిపడ్డారు. …

Read More »

మోదీ నాయకత్వంలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? – మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. ౩౦ ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే …

Read More »

క్యాన్సర్‌ ను ఎదుర్కోవడానికి మందు అదేనా..?

సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి  క్యాన్సర్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …

Read More »

మొటిమల సమస్యకు పరిష్కారం లేదా..?

మంచి యవన వయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు . పన్నెండు శాతం మహిళలను నాలుగుపదుల దశలోనూ ఇబ్బంది పెడుతుంది. పురుషులూ ఇందుకు మినహాయింపు కాదు. మొహం మీద ఎక్కువగా కనిపించినా.. ఛాతీ, వీపు, భుజాలపైనా మొటిమలు వస్తాయి. మరీ ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. కౌమార బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయివి. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత మచ్చల్లా మిగిలిపోతాయి. కౌమారంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, బ్యాక్టీరియా, కాలుష్యం, జీన్స్‌.. ఇలా మొటిమలకు …

Read More »

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండో రోజైన నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టనున్నారు. అనంతరం టేబుల్‌ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు. రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat