Classic Layout

కేసీఆర్‌ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్‌ చేయలేరు: జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్‌ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …

Read More »

ఏక్‌నాథ్‌షిండేపై ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తనను మోసం చేశారని.. తాను లేవలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై కుట్ర పన్నారని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కూలిపోయే విషయంలో షిండే వ్యవహరించిన తీరుపై ఉద్ధవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. ఆయన్ను తానే సీఎంగా చేసినా అతడిలో …

Read More »

వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా?: బొత్స

ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …

Read More »

బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …

Read More »

బాలుడికి తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చేసిన జగన్‌.. కాస్ట్‌ ఎంతో తెలుసా?

వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్‌ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్‌ను తిరిగి …

Read More »

అప్పుడు నేనొస్తే అందరూ నా చుట్టే తిరిగేవారు.. : జగన్‌

ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్‌ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …

Read More »

మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ రోజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోను.. తాను ఎప్పటికి స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో …

Read More »

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో  ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …

Read More »

నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం

నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ డ్యామ్‌ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Read More »

ఎంఎస్ ధోనీకి సుప్రీం కోర్టు నోటీసులు

టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో  సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat