Classic Layout

మంకీపాక్స్‌.. ఎలాంటి ఆందోళన వద్దు: హరీష్‌రావు

మంకీపాక్స్‌ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో మంకీపాక్స్‌ రెండో కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఫీవర్‌ ఆస్పత్రిని మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రంగా చేసినట్లుహరీష్‌రావు చెప్పారు.

Read More »

ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్‌

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్‌ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్‌ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …

Read More »

మరో టాలీవుడ్‌ జంట విడాకులకు సిద్ధమైందా?

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడాకులకు సిద్ధమైందా? అవుననే ప్రచారమే జోరుగా జరుగుతోంది. ఢీ, రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌షా తదితర సినిమాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న డైరెక్టర్‌ శ్రీనువైట్ల జంట ఈ విడాకులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను నుంచి ఆయన భార్య రూప విడాకులు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఆమె నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించినట్లు ప్రచారం …

Read More »

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్‌ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్‌ హైదరాబాద్‌నుంచి గుజరాత్‌ వెళ్తుండగా.. మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూప్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్‌ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.

Read More »

సీఎం కేసీఆర్‌పై షర్మిల్‌ సెటైరికల్‌ ట్వీట్‌

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్‌ బరస్ట్‌’పై ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …

Read More »

రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల  ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని  ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా …

Read More »

నిర్మాత బన్నీవాసుకి తప్పిన పెను ప్రమాదం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ప.గో జిల్లా పాలకొల్లులోని బాడవ గ్రామంలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే పడవ వరద ప్రవాహానికి కొబ్బరిచెట్టుకు ఢీకొని విరిగిపోయింది. వాసుతోపాటు మిగతావారు నీటిలో పడిపోయారు. పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ‘అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం’ అని బన్నీవాసు అన్నారు.

Read More »

రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్

 ఎప్పుడు వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్ తగిలింది. వర్మ  రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు నాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటున్నాడని వివరించాడు. విచారించిన …

Read More »

ఉపాసన సంచలన వ్యాఖ్యలు

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆయన సతీమణి ఉపాసనకు ఇప్పటివరకు సంతానం లేని సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ విషయంపై తమ గురించి వస్తున్న వార్తలపై ఉపాసన స్పందించారు. ఆమె మాట్లాడుతూ తమకు పిల్లలు వద్దనుకుంటున్నట్లు ఎక్కడా అనలేదని   అన్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయి. పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు చెప్పారు. జనాభా నియంత్రణ కోసం పిల్లలు వద్దనుకునేవారిని అభినందించాల్సిందే …

Read More »

రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ రికార్డు

 వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన  ట్రయిలర్  విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat