తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2020తో పోల్చితే 9.88లక్షల ఎకరాలు పెరిగి 27.95 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ వెల్లడించింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 22.19తో పోలిస్తే 25శాతం అదనంగా పెరిగినట్లు తెలిపింది. ఈ సీజన్లో వరి, శనగ, మినుము పొద్దు తిరుగుడు పంటలు అధికంగా వేశారు. అటు మరో ప్రధాన పంట వేరు శనగ విస్తీర్ణం …
Read More »TimeLine Layout
January, 2021
-
28 January
తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.
Read More » -
28 January
తెలంగాణలో వేరుశనగకు భారీగా ధర
తెలంగాణలో వేరుశనగ ధర భారీగా పెరిగింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.8,376 ధర పలికింది. మద్దతు ధర రూ.5,225ను మించి ఉండటంతో రైతులు సంబరపడుతున్నారు. వనపర్తి మార్కెట్లో గత ఏడాది రూ.3,500 నుంచి రూ.5,000 లోపు ఉన్న వేరుశనగ ఈ ఏడాది ఏకంగా రూ.7,942 పలుకుతోంది. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. గతేడాది భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో రికార్డు స్థాయిలో ధరలు …
Read More » -
28 January
డిగ్రీతో ఉద్యోగాలు
మేనేజర్ సెక్యూరిటీల పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 పోస్టులు (జనరల్ – 40, SEC – 15, ST- 8, OBC -27 EWS- 10) ఉన్నాయి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు అర్హత: డిగ్రీ, మెడికల్ ఫిట్ నెస్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 (SC/ST/మహిళలకు లేదు). ఎంపిక ప్రక్రియ అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి …
Read More » -
28 January
లవంగాలతో లాభాలు..?
లవంగాలతో లాభాలెన్నో ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందామా..? ఆహారం జీర్ణం కాకపోతే నోట్లో రెండు లవంగాలు వేసుకుంటే వికారం లాంటివి పోతాయి లవంగం చప్పరిస్తుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. చిగుళ్లు దెబ్బతినకుండా చేస్తుంది తలనొప్పి అధికంగా ఉంటే రోజూ రెండు లవంగాలు తినాలి బీపీ, షుగర్ను కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి
Read More » -
27 January
దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉత్తరాది భామ లావణ్యత్రిపాఠి. ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్కిషన్ తో కలిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో తళుక్కున మెరిసింది. లావణ్య ఈ సారి యాక్టింగ్ లో తన హద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? అంటూ ఏ1 ఎక్స్ …
Read More » -
27 January
వివాదంలో మోనాల్ గజ్జర్
ఓ ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ శ్రీ రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశమంతా పూజించే దేవుడిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నీకు శ్రీ రాముడి గురించి ఏం తెలుసు.. దేవుడి గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానివి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు. ఏ హక్కు ఉందని రాముడి గురించి మాట్లాడావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం …
Read More » -
27 January
హద్దులు దాటిన బుట్ట బొమ్మ
స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కలిసి నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో కీ రోల్ కోసం మేకర్స్ ఈ భామను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాంచరణ్ గెస్ట్ రోల్ చేస్తుండగా..పూజాహెగ్డే చెర్రీకి జోడీగా నటిస్తున్నట్టు టాక్. …
Read More » -
27 January
ఏపీలో మొత్తం ఓటర్లు 2,77,17,784 మంది
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు
Read More » -
27 January
కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి ఎంతో తెలుసా..?
దేశంలో తయారవుతున్న కోవిడ్ వ్యాక్సిన్ల కాల పరిమితి 6నెలలుగా ఉందని తయారీ కంపెనీలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 20లక్షల డోసులనే ఫ్రంట్లైన్ వారియర్లకు ఇచ్చారు. దీంతో మిగతా డోసులను వేగంగా ఇవ్వాలని సూచిస్తున్నాయి. అటు ఇప్పటికే రెండు కంపెనీలు 2కోట్ల చొప్పున వ్యాక్సిన్లను తయారు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. దీంతో వీటి వినియోగం కూడా జరగాల్సి ఉంది
Read More »