TimeLine Layout

August, 2022

  • 6 August

    తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

    రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర  వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …

    Read More »
  • 6 August

    దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

    సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …

    Read More »
  • 6 August

    ఢిల్లీకి బండి‌ సంజయ్

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్  ఢిల్లీ  కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ  అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ,  పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు …

    Read More »
  • 6 August

    రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

     ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో …

    Read More »
  • 6 August

    దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి

    దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 19,406 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 19,928 మంది కోలుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉంద‌ని తెలిపింది.

    Read More »
  • 6 August

    తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయం

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణీలకు నార్మల్ డెలివరీలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్ నుంచి శానిటేషన్ స్టాఫ్వరకు గైనకాలజిస్ట్ / మెడికల్ ఆఫీసర్, మిడ్వైఫ్/స్టాఫ్ నర్సు/ఏఎన్ఎంలకు రూ.1000, ఆయా/శానిటేషన్ వర్కర్లకు రూ.500, ఏఎన్ఎంకు రూ.250 …

    Read More »
  • 6 August

    వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టనివ్వం

     రైతుకు హాని చేసే ఏ చర్యనూ తాము ఒప్పుకోబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ కన్వర్జేషన్‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ఈ బిల్లును బిల్లును మామూలుగా చదివితే ఫర్వాలేదనిపిస్తుందని, కానీ ఈ బిల్లు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న బలవంతపు విధానాలతో దేశం మరింత వెనుకబడిపోతుందని ఆవేదన …

    Read More »
  • 6 August

    సినిమాల గురించి మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

    సినిమాల్లో కంటెంట్ బావుంటే ఆ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నిన్న విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు విజయం సాధించడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటనిచ్చిందని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.

    Read More »
  • 5 August

    బాప్‌రే.. రణ్‌వీర్‌లా నటి న్యూడ్‌ ఫొటో..

    ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ న్యూడ్‌గా తీసిన ఫొటో షూట్‌ ఎంత రచ్చ అయింది ప్రత్యేకంగా చెప్పలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో కొంతమంది రణ్‌వీర్‌కు మద్దతు తెలిపారు కూడా. తాజాగా ఆయన బాటలో ఓ నటి కూడా చేరింది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ 12’ ఫేమ్, టీవీ ఆర్టిస్ట్‌ ఎరికా ప్యాకర్డ్‌ తాజా సంచలనానికి …

    Read More »
  • 5 August

    ఎన్టీఆర్‌ కుమార్తె పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముందో తెలుసా?

    టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక జూబ్లీహిల్స్‌ పోలీసులకు చేరింది. ఉస్మానియా ఫొరెన్సిక్‌ డాక్టర్లు ఆ నివేదికను పోలీసులకు అందజేశారు. ఉమామహేశ్వరి సూసైడ్‌చేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. మెడ భాగంలో స్వరపేటిక బ్రేక్‌ అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో ఉంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..తాజాగా అందిన ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat