TimeLine Layout

May, 2022

  • 25 May

    బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

    బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి విధితమే.. ఈ షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్‌ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.

    Read More »
  • 25 May

    మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ షాక్‌

    కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …

    Read More »
  • 25 May

    దేశంలో మరోసారి కరోనా విజృంభణ

    దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న  మంగళవారం 1,675 మందికి పాజిటివ్‌ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర …

    Read More »
  • 25 May

    కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే Kp…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణు గోపాలస్వామి ఆలయం వద్ద హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ …

    Read More »
  • 25 May

    మెగా అభిమానులకు Good News

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్‌ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …

    Read More »
  • 25 May

    వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడి రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై  జరిగింది. దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్‌ సంచలన విషయం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్‌ …

    Read More »
  • 25 May

    మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?

    మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?! అన్నం తినడానికి మారాం చేస్తున్నారా..?.అయితే ఈ  చిట్కాలను ఉపయోగిస్తే వాళ్లను  దారికి తెచ్చుకోవచ్చు.అన్నం తినిపించవచ్చు.. ♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి. ♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను …

    Read More »
  • 25 May

    మీ చర్మం మెరవాలా..?

    ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్‌ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్‌ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. ♥ సోయాబీన్‌ నూనెను చర్మానికి …

    Read More »
  • 25 May

    కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

    తెలంగాణ  రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్‌ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. హనుమాన్‌ నామస్మరణతో మారుమోగుతున్నది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat