TimeLine Layout

May, 2022

  • 23 May

    కోర్టుకు హజరైన నారా లోకేష్ -ఎందుకంటే..?

     ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో సీనియర్‌ నాయకుడు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. 2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు …

    Read More »
  • 23 May

    అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?

    సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …

    Read More »
  • 23 May

    దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా

    దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన  బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే  14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్‌ …

    Read More »
  • 23 May

    BJP కి ఈటల రాజేందర్ షాక్

    గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు …

    Read More »
  • 21 May

    ఈసారి నా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేయను: వెంకటేశ్‌

    తన ఫ్యాన్స్‌ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్‌ చేయనని ప్రముఖ హీరో వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్‌ 3’ మూవీ ఈనెల 27న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ హైదరాబాద్‌లో ‘ఫన్‌టాస్టిక్’ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మూవీలో వెంకటేశ్‌తో పాటు వరుణ్‌తేజ్‌ కూడా నటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల ప్రభావంతో తాను నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలు …

    Read More »
  • 21 May

    ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్‌

    యంగ్‌ టైగర్‌ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్‌డే విషెష్‌ చెప్పిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, సన్నిహితులకు ఎన్టీఆర్‌ థాంక్స్‌ చెప్పాడు. …

    Read More »
  • 21 May

    దేశంలో త్వరలో ఒక సంచలనం జరుగుతుంది: కేసీఆర్‌

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్‌ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేసీఆర్‌కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు. ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పొలిటికల్‌ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్‌ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో …

    Read More »
  • 21 May

    భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. గ్యాస్‌పైనా భారీ రాయితీ

    దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్‌. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ సిలిండర్‌ …

    Read More »
  • 21 May

    ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ అఖిల్‌కి షాక్‌.. విజేత బింధు మాధవి!

    బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌ సీజన్‌-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నటి బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. యాంకర్‌, నటుడు అఖిల్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్‌ అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన తొలి ఉమెన్‌ కంటెస్టెంట్‌ బింధుమాధవియే కావడం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat