త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు. 1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More »TimeLine Layout
February, 2022
-
20 February
బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
Read More » -
20 February
రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
Read More » -
20 February
ఆకాశాన్నంటిన బంగారం ధరలు
భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి …
Read More » -
20 February
హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల అభివృద్ధి, సంరక్షణ కోసం మరిన్ని చర్యలు
హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టుల పైన మంత్రి కే తారకరామారావు ఈ రోజు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరువుల …
Read More » -
20 February
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.
ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన …
Read More » -
20 February
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More » -
20 February
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ …
Read More » -
20 February
భారత టెస్టు సారథిగా రోహిత్ శర్మ
అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …
Read More » -
19 February
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,042 కరోనా టెస్టులు చేయగా, 425 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 130 కేసులు బయటపడ్డాయి. 1,060 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,111 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »