TimeLine Layout

January, 2022

  • 14 January

    రిషబ్ పంత్ అరుదైన రికార్డు

    టీమిండియా యంగ్ వికెట్ కీపర్ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియా బయట 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు. * మంజ్రేకర్ 118(వెస్టీండిస్ పై కింగ్ డన్ లో ) * రాత్రా 115*(వెస్టీండిస్ పై, సెయింట్ జాన్స్ లో 2002) * సాహా 104 (వెస్టీండిస్ పై, గ్రాస్ ఐలెట్ లో 2016) …

    Read More »
  • 14 January

    విలన్ గా నటించేందుకు సిద్ధం

    తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో నటించిన సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరలో గరుడ వేగ-2 మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. సినిమాలో ఒక మంచి పాత్ర వస్తే మళ్లీ విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో రాజశేఖర్ చెప్పాడు. శేఖర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో, అన్ని కుదిరితే ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నాడు..

    Read More »
  • 14 January

    చిరు-జగన్ భేటీపై నాగ్ సంచలన వ్యాఖ్యలు

    మెగాస్టార్ చిరంజీవి,ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిల భేటీపై టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున స్పందించాడు. ‘మా’ అందరి కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారు. సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్లలేకపోయా. జగన్కు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి వెళ్తా అన్నారు.. నేను వెళ్లమని సలహా ఇచ్చా. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. టికెట్ రేట్లపై స్పందించింది నా సినిమా వరకు …

    Read More »
  • 14 January

    పంటి నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు

    మనకు తలనొప్పి అఖరికి కడుపు నొప్పి వచ్చిన తట్టుకోగలం కానీ పంటి నొప్పి వస్తే మాత్రం మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు బాధపడతాం..అయితే అలాంటి పంటి నొప్పి.. ఉపశమనానికి చిట్కాలు – వెల్లుల్లి, ఉప్పు/మిరియాలు బాగా దంచి నొప్పిగా ఉన్న – పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. – నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి. కొద్ది సేపటికి ఉపశమనం లభిస్తుంది. – ఒక పలుచటి గుడ్డలో …

    Read More »
  • 14 January

    BJP కి షాక్

    యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నిష్క్రమిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. తాజాగా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, బీసీలు, మైనారిటీలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.

    Read More »
  • 14 January

    ఏపీలో కొత్తగా 4,348మందికి కరోనా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చేరుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి పరీక్షలు చేయగా 4,348మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 14,204యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 20,92,227కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మొత్తం 14,507 మంది కరోనా కారణంగా మరణించారు.

    Read More »
  • 14 January

    బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం బంద్ చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వాళ్లూ కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని తెలిపారు.

    Read More »
  • 14 January

    నెలసరి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణాలు

    హార్మోన్ ఇంబాలెన్స్, రక్తహీనత.. నెలసరి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు వంటి గింజలను తీసుకోవాలి. అలాగే, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు రోజూ తీసుకోవాలి. సోయా, పనీర్, మీల్ మేకర్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. వీటితో పాటు మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.

    Read More »
  • 14 January

    జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ క్లారిటీ

    తెలంగాణ రాష్ట్ర సీఎం,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల వరుసగా జాతీయ పార్టీలకు చెందిన నేతలను,ఇతర రాష్ట్రాలకి చెందిన తాజా మాజీ సీఎంలతో భేటీ అవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ మరోసారి స్పందించారు. తెలంగాణలో ఉండి రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విటర్లో ఆయన #AskKTR సెషన్ నిర్వహించారు. ఈ …

    Read More »
  • 14 January

    టీమిండియా 198 పరుగులకి ఆలౌట్

    కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 67.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 211లీడ్ సాధించింది. పంత్ 100తో రాణించాడు. మిగితా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్ల చొప్పున తీశారు. అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat