తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …
Read More »TimeLine Layout
May, 2021
-
5 May
కరోనా కట్టడీకి అదోక్కటే మార్గం
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.
Read More » -
5 May
తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో …
Read More » -
5 May
ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’
ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …
Read More » -
5 May
ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More » -
5 May
అందాన్ని ఆదరించని ఓటర్లు
యూపీ పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓడిపోయారు. జౌనప్పర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన ఆమె.. 2వేల ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు. మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు.
Read More » -
5 May
అందాల దేవత స్మృతి మందానా క్రష్ ఎవరో తెలుసా..?
క్రికెట్ ప్రపంచంలో అందాల దేవత స్మృతి మందానా. ఆటతోనే కాకుండా తన నవ్వుతో కోట్ల మందిని మెస్మరైజ్ చేసింది. అలాంటి ఈ టీమిండియా ప్లేయర్కు ఓ హీరోకు ఫిదా అయిపోయిందట. అతడే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్. చిన్నప్పట్నుంచి అతడంటే చాలా ఇష్టమని, హృతిక్ మూవీలన్నీ పక్కాగా చూస్తానని చెప్పింది. కాగా చిన్న వయసులోనే రిచ్ మహిళా క్రికెట్ ప్లేయర్ 24 ఏళ్ల స్మృతి రికార్డు సాధించింది.
Read More » -
5 May
కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
ట్విట్టర్ తన ఖాతాను సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైరయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్విట్టర్పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికా బుద్ధి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నల్లజాతివారిని తెల్లవాళ్లు ఎప్పుడూ బానిసలుగానే భావిస్తారు. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేయాలనుకుంటారు. ట్విట్టర్ పోతే ఏంటీ.. నా గొంతు వినిపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని కంగన తెలిపింది.
Read More » -
5 May
ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా దీదీ ప్రమాణం
వెస్ట్ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి బరిలోకి దిగిన మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆర్టికల్ 164(4) ప్రకారం మంత్రిగా/ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకోవాలి. బెంగాల్లో శాసనమండలి లేదు కాబట్టి మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఉపఎన్నికల్లో గనుక మమత ఓడిపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిందే.
Read More » -
5 May
తెలంగాణలో మరో ఇంటింటి సర్వే
కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది. వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Read More »