Home / SLIDER / ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’

ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’

ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్‌ చేయించాలని చెప్పారు..

సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి ఆపరేషన్‌ చేయించారు.

సర్జరీ తర్వాత కూడా మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకొన్నారు. పూర్తిగా కోలుకున్న జ్ఞాపిక మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యింది. ఈ సందర్భంగా మానవత్వంతో స్పందించిన కవితకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో తమ బిడ్డకు వైద్యం చేయించారని, ఆమె రుణం తీర్చుకోలేమని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat