దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.