ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్హెచ్డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …
Read More »తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్
2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు
Read More »కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …
Read More »రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »ఇండియా సెలబ్రేటీలకు లాయర్ ప్రశాంత్ భూషన్ దిమ్మతిరిగే కౌంటర్
రైతు ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ చేసిన ట్వీట్కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? . రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసేసరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని మనసు లేని సర్కారు సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు
Read More »బీజేపీ సంచలన నిర్ణయం
గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు.. అలాగే, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందుకు టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటించింది. పార్టీ టికెట్ల కోసం పోటీ పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు BJP గుజరాత్ శ్రేణులు చెబుతున్నాయి
Read More »కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ బడ్జెట్ లో కొత్తగా పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం’ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఈ మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అటు దేశంలో కొత్తగా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పుణెలో మాత్రమే ఈ తరహా ల్యాబ్ ఉంది.
Read More »రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22-మొబైల్ వినియోగదారులకు షాక్
కేంద్ర బడ్జెట్ లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పై 2.5% కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అటు కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలులోకి రానుండగా.. అప్పటి నుంచి ధరలు పెరుగుతాయి.
Read More »