అనాటి హీరోలలో కాంతారావుకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయన మరణించారు. ఈ రోజు మధ్యాహ్నాం 12 గంటల సమయంలో కాంతారావు సతీమణి హైమావతి(87) గుండెపోటుతో మరణించారు. మల్లాపూర్లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వర్గస్తులయ్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, …
Read More »కీర్తి సురేష్ కు మరో గుర్తింపు.. ఏంటి అది..?
మహానటి’ కీర్తి సురేష్ కు మరో గుర్తింపు లభించింది తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో ఆమెకు స్థానం దక్కింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రసీమల్లో ఆమె చేస్తున్న విశేష సేవలకు ఈ గుర్తింపు లభించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. దీనిపై స్పందించిన కీర్తి.. ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వివిధ రంగాల ప్రముఖుల సరసన తన పేరుండటం ఆనందంగా ఉందని …
Read More »సరికొత్తగా వకీల్ సాబ్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో …
Read More »బాలయ్యతో గోపీచంద్ మలినేని మూవీ
ఇటీవల కరోనా కాలంలో విడుదలై మాస్ మహారాజ్ రవితేజ,అందాల రాక్షసి శృతి హాసన్ నటించిన క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని టాక్. గోపీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచే సెట్స్ పైకి వెళ్తుందట. దీనిపై త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ …
Read More »రైతు ఉద్యమానికి పాప్ సింగర్ రిహాన్నా మద్దతు
ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహాన్నా రైతు ఆందోళనలకు మద్దతిచ్చింది. ‘ఈ అంశంపై మనం ఎందుకు మాట్లడటం లేదు’ అని ట్విట్టర్ లో ప్రశ్నించింది. ఆమె అడిగిన తీరుకు సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశ సెలబ్రిటీలు ఎక్కడా అంటూ నెటిజన్లు #UselessIndian celebrities అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమెకు కౌంటర్గా కంగనా ‘వారు రైతులు కాదు. అందుకే వారి గురించి ఎవరూ మాట్లాడరని’ ఘాటుగా సమాధానమిచ్చింది.
Read More »డిఫరెంట్ గా “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది భిన్నమైన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నానికి మడోన్నాకు కలకత్తా నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఇంకా ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు
Read More »KGF-2 విడుదల రోజు సెలవు కావాలంటూ ప్రధాని మోదీకి లేఖ
కేజీఎఫ్ అనే కన్నడ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 200 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జరుగుతుంది. మరోవైపు కేజీఎఫ్ …
Read More »హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి ఇటీవల పలు విషయాలు పంచుకుంది. తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది. తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో …
Read More »కమెడియన్ కు జోడిగా సాయిపల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది. భారీ చిత్రాల్లో నటిస్తున్న సాయిపల్లవి ఓ ఎక్స్పెరిమెంట్కు తెర తీస్తుందట. తమిళంలో చేయబోయే ఓ సినిమాలో సాయిపల్లవి కమెడియన్ సరసన నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు తమిళంలో కమెడియన్గా పేరు తెచ్చుకున్న కాళి వెంకట్ జోడీగా సాయిపల్లవిని నటింప …
Read More »సినిమా థియేటర్లకు గుడ్న్యూస్
దేశంలోని సినిమా థియేటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ కేవలం 50 …
Read More »