హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. -ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ – కోఠి రోడ్లు మూసివేత -బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు -కాచిగూడ రైల్వేష్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు -నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించాలి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలను కోరారు. నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం …
Read More »జీహెచ్ఎంసీ చట్టానికి 5 సవరణలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్ఎంసీ రిజర్వేషన్ …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని …
Read More »అర్హులు 58, 59 జీవోలను సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్లోని రహ్మత్నగర్లో ఆయన పర్యటించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవోల గురించి ఇంటింటికీ తిరిగుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అవగాహన కల్పించారు. జీవోల పై వారు అడిగే సందేహాలను నివృత్తి చేశారు. 125 గజాల వరకు …
Read More »అధునాతన టెక్నాలజీతో జీహెచ్ఎంసీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు టీ పోల్ పై అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల …
Read More »గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ
గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …
Read More »గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు
తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్ఎంఆర్ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్లో అధికారులు కొవిడ్ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్ భయం..వర్క్ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …
Read More »గ్రేటర్లో లక్ష ‘డబుల్ ఇళ్లు’
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు …
Read More »