తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన …
Read More »తెలంగాణలో కొత్తగా 3,308 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ర్టంలో కొత్తగా 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 42,959 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మం జిల్లాలో …
Read More »తెలంగాణలో వీసీల నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. …
Read More »విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తునకు జూన్ 15వ తేదీ వరకు గడువు
తెలంగాణలోని ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీంను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి ఎస్టీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తునకు జూన్ 15వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. …
Read More »తెలంగాణలో ఇక ఉదయం6గం.ల నుండి 10గం.ల వరకే
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. ఆంక్షలు అమల్లో ఉండే ఉ.10 గంటల తర్వాత కూడా ప్రజలు బయటకు వస్తున్నట్లు DGP మహేందర్ రెడ్డి తెలిపారు. ‘ఏ అవసరం ఉన్నా ఉ.6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ 4 గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఇస్తాం. లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను …
Read More »ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు
కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్కు పేరుంది. ఈ క్రమంలో …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. రెగ్యులర్ సహా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3060 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »సెల్యూట్ పోలీస్
కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్మార్కెటింగ్కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్మార్కెటింగ్పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ …
Read More »