ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు..ఎమ్మెస్సీ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజినీ అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ GHMC కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లల తల్లి రజినీ రోజువారి కార్మికురాలిగా పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఈరోజు ఆమెను …
Read More »యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు టీఎస్ఐసీ ద్వారా ప్రభుత్వం కృషి
యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్ ఎడిషన్లో భాగం గా టీఎస్ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …
Read More »లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా-మంత్రి KTR
కావాలనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి …
Read More »రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. ఎయిమ్స్ టెస్టు కోసం రాహుల్ గాంధీ వస్తే తానూ వస్తానన్నారు. చర్లపల్లిలో జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ను ఒప్పించాలన్నారు. తాను టెస్టు చేయించుకుని క్లీన్ చీట్ వస్తే పదవి నుంచి తప్పుకుంటారా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని …
Read More »జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 64 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మరో 64 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,39,981 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను డ్రగ్స్ అంబాసిడర్ అనటంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్నేత రాహుల్గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 …
Read More »పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్పై కేటీఆర్ సెటైర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్కు వచ్చాడా.. ఫామ్ హౌస్లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్ టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ్ణ హోటల్లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కిటెక్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …
Read More »