తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »కేంద్రంపై పోరాడాలి- సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై సిఎం వారితో చర్చించారు. ముఖ్యంగా…సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని …
Read More »వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ బీసీ గురుకులాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితవిద్య పొందుతుండగా, తాజాగా ఇంటర్మీడియట్ ను కూడా అక్కడే చదివేలా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు తెలిపారు. బీసీ గురుకులాలపై శుక్రవారం …
Read More »దత్తత గ్రామానికి రూ.6కోట్లు మంజూరు
తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్కుమార్ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న …
Read More »ఆ లోటు ఎల్.రమణ రాకతో తీరింది: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్. రమణకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి …
Read More »‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇంద్రసేన గుప్త, కస్తూరి బాల్ రాజ్, రషీద్ బైగ్, కమలాకర్, పర్శ శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, నవాబ్, మసూద్, …
Read More »సీఎం కేసీఆర్ సమక్షంలో నేడు టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎలగందుల రమణ శుక్రవారం టీఆర్ఎస్లో లాంఛనంగా చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణభవన్లో నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి ప్రసంగిస్తారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్తో సమావేశమైన అనంతరం రమణ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతులమీదుగా …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు …
Read More »