దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-3గ్గురు సీఎం లకు షాక్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …
Read More »తెలంగాణలో కొలువుల జాతర -80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం.. నేడు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ …
Read More »సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
Read More »17 లక్షల కుటుంబాలకు దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »మెంతులతో కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
మెంతులతో కలిగే ప్రయోజనాలు తెలుసా?.. ఆ ప్రయోజనాలు ఏంటో మీకోసం.. *పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. *ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *ఎముకలు బలంగా ఉంటాయి. *ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు.
Read More »తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం.
బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *ఇంట్లోని మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి. *కొంచెం నీటిలో కిరోసిన్ కలిపి ఇంటి మూలల్లో చల్లాలి. *బిరియానీ ఆకులను పొడిచేసి ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. *బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …
Read More »