Home / Tag Archives: slider (page 597)

Tag Archives: slider

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు. మరో 4,42,009 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 37,681 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 260 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే …

Read More »

ఖైత‌రాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తొలి పూజ

ఖైత‌రాబాద్ పంచ‌ముఖ రుద్ర మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు. ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి తొలి పూజ చేయ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. క‌రోనాను విఘ్నేశ్వ‌రుడు పార‌దోలాలి. ప్ర‌తి ఒక్క‌రూ …

Read More »

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా ప‌డింది. టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు శిక్ష‌ణ సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

Read More »

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన సీఎస్‌గా స‌మీర్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు.

Read More »

హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద 125 అడుగుల ఎత్తులో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాట్ల‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని 15 నెల‌ల్లో ఏర్పాటు చేస్తామ‌న్నారు. విగ్ర‌హం వ‌ద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాల‌రీ, గ్రంథాల‌యం కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. లేజ‌ర్ షో అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు. …

Read More »

గోమ‌య గ‌ణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి ఐకే రెడ్డి

 పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమ‌య‌ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాల‌యంలో గోమ‌య గ‌ణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమ‌య గ‌ణ‌ప‌తి విగ్రహాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుగ్..పర్యావరణానికి మేలు …

Read More »

జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతాం

 జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని వెల్టూరు గోపాల సముద్రం, పెబ్బేరు మహా భూపాల సముద్రం, జానంపేట రామసముద్రం, శ్రీ రంగాపురం రంగసముద్రం, వనపర్తి నల్లచెరువు, గోపాల్ పేట కత్వ చెరువు, పొలికెపాడు మొగుళ్ల చెరువు, బుద్దారం పెద్ద చెరువులలో 5.50 లక్షల చేప పిల్లల విడుదల చేసి మాట్లాడారు. చెరువులు, కుంటలే మత్స్యకారులకు జీవనాధారం. గత …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదార్యం

తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు. నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన …

Read More »

హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగ  ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకున్నది. ఈ విద్యార్థులకు సర్కారు స్కూళ్లల్లో పాఠాలు చెప్పించడమే కాకుండా అక్కడే వారికి మధ్యాహ్న భోజనాన్ని సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి రాష్టంలోని విద్యాసంస్థలు ప్రారంభంకాగా, విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం …

Read More »

ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?

పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విష‌యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) ప‌లువురు సెల‌బ్రిటీల‌ను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్,నందు, రానాల‌ని విచారించిన ఈడీ నేడు ర‌వితేజ‌ను విచారించ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat