Home / Tag Archives: slider (page 763)

Tag Archives: slider

మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …

Read More »

రేపు సిద్దిపేటకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More »

మీరు బరువు తగ్గాలంటే

మీరు బరువు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి

Read More »

ఏపీలో తగ్గని కరోనా కేసులు

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు

Read More »

మంత్రి మల్లారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు…

ఇటీవలే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన అంతర్రాష్ట్రీయ కబడ్డీ పోటీలను జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారు గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు నవీన్ రావు గారు, శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మాధవరం కృష్ణా రావు గారు మంత్రి మల్లారెడ్డి గారిని బోయిన్ పల్లి లోని తన నివాసం వద్ద కలిసి పరామర్శించారు.

Read More »

హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం

హైదరాబాద్‌లో  కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ‌ నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.

Read More »

సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు …

Read More »

భగత్ అఖండ విజయం సాధించడం ఖాయం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. భగత్ కు అన్ని వర్గాల మద్ధతు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతుడైన భగత్ ను గెలిపించడం వల్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. …

Read More »

రజనీకాంత్‌కు దాదాసాహెబ్.. గొప్ప విషయం: సీఎం కేసీఆర్

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్‌ …

Read More »

మాజీ మంత్రి జానారెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణలో రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతితో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat