మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై కేసు నమోదు అయింది. తాడిపత్రి టౌన్ పీఎస్లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …
Read More »ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశగా కవిత
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. భారీ ఆధిక్యం దిశగా ఉద్యమ పార్టీ అభ్యర్థి కవిత దూసుకెళ్తున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి 600 ఓట్లకుగాను టీఆర్ఎస్కు 542 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్కే వచ్చాయి. మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్లో లెక్కించనున్నారు. …
Read More »దర్గాలో మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా …
Read More »నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …
Read More »సౌందర్య జీవితంపై బయోపిక్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సినీయర్ హీరోయిన్ దివంగత సౌందర్య జీవితంపై బయోపిక్ రానున్నది. దక్షిణాదిలోనే వందకుపైగా చిత్రాల్లో తన అద్భుతాభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె విషాదాంత మరణం ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేసింది. ఈ నేపథ్యంలో ఆమె సినీ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సౌందర్య పాత్రను సాయిపల్లవి పోషించనుందని …
Read More »తెలంగాణలో పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్శాఖ పరిశీలిస్తున్నది. మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. …
Read More »దుబ్బాకలో రూ.104.09 కోట్లతో విద్యుత్ పనులు
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్ జిగేల్మంటున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్, బొప్పాపూర్, కాసులాబాద్, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్పల్లి, అనాజీపూర్, కాసన్పల్లి, అనంతసాగర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లను 14 కొత్త …
Read More »అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »