యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్గోపాల్ వర్మ. ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
Read More »నేనేంతో ఆదృష్టవంతుడ్ని
నేనెంతో అదృష్టవంతుడినో చెప్పనక్కర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్రముఖ సినీ గాయకుడు, స్వర ఝరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తనను పాడుతాతీయగా ప్రోగ్రామ్కు జడ్జ్గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయన కోరిక మేరకు అక్కడకు వెళ్లిన తనకు అద్భుతమైన ఇంట్రడక్షన్ను బాలుగారు ఇచ్చారని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యాజికల్ వాయిస్లో …
Read More »బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్కమాండర్ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. గత ఏడాది భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్కమాండర్ అభినందన్.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్ ప్రభుత్వం అభినందన్ని భారత …
Read More »ఏపీలో కొత్తగా కొత్తగా 7,073 కరోనా కేసులు..
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో …
Read More »ఎస్పీ బాలు తొలి రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..?
తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి.. ప్రాణం పోసిన సూపర్ సింగర్ ఎస్పీ బాలు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటిన బాలూ హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు …
Read More »ఎస్పీ బాలు ఇక లేరు
టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర …
Read More »జలుబు,జ్వరం వస్తే భయపడకండి
జలుబు,జ్వరం వస్తే కరోనా అని భయపడకండి..ఏమీ చేయదు…త్వరగా రికవరీ అవుతారు..మిమ్మల్ని ఏమి చేయదు…కరోనాతో భయపడకండి… మీకు నేను అండగా ఉన్నాను. ధైర్యంగా ఉందాం.. కరోనాని ఎదుర్కొందాం… మీరెట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దు. మరీ సమస్యగా ఉంటే నాకు గానీ, నా సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. 24 గంటలూ అందుబాటులో ఉంటాం. అందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు
తెలంగాణ కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,021 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడిన వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 10 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,81,627 మంది కరోనా బారినపడగా 1,50,160 …
Read More »దేశంలో కొత్తగా 86 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు 80 వేలకుపైగా నమోదవుతూ ఉన్నాయి. ఈరోజుకూడా 86 వేల మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసులు 58 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరింది. ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండగా, మరో 47,56,165 మంది బాధితులు కరోనా నుంచి …
Read More »సరికొత్త పాత్రలో పూర్ణ
శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి పూర్ణ. ఆ తర్వాత సీమటపాకాయ్, అవును, అవును 2, రాజుగారి గది వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడులో కూడా మెరిసింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన ఈ భామ ఇపుడు నెగెటివ్ రోల్ లో అలరించేందుకు సిద్దమవుతోంది. రాజ్తరుణ్-విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ …
Read More »