సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు …
Read More »కొత్త లుక్ లో విజయ్ దేవరకొండ
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త లుక్లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహసాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నానని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు డాడీ.. ఐ లవ్ యూ..’ అని విజయ్ పోస్ట్ చేశారు. …
Read More »కరోనాపై సమరంలో గెలుపు దిశగా
కరోనాతో సమరంలో ప్రపంచం ఓడిపోయిందా? కరోనాపై ఎత్తిన కత్తిని అన్ని దేశాలు ఒక్కొక్కటిగా దించేస్తున్నాయా? కరోనాను కంటిచూపుతో చంపేస్తాం, ఆ వైరస్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, కత్తికో కండగా నరికేస్తాం అని బీరాలు పలికిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వైరస్తో సహజీవనానికి సిద్ధమవుతున్నాయా? గిర్రున రోజులు తిరుగుతున్నా, క్యాలెండర్లో నెలల షీట్స్ సర్రున చిరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గని కరోనా కేసులు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి.. ప్రపంచానికి …
Read More »నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది
నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుందంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, అహంకారం తలకెక్కినప్పుడు నోరు అదుపులో వుండదు… నోటికేదొస్తే అలా మాట్లాడేయడమే… కాని, ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది. పరిస్థితులే శిక్షలు వేస్తాయి. అలాంటి సమయంలో వారిపట్ల కనీస జాలి, దయ చూపించేవాళ్ళు కూడా మిగలరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలైన జేసీ సోదరులు.. గత చంద్రబాబు …
Read More »దానికోసమే ఏపీకి మూడు రాజధానులు
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న తన ఉక్కు సంకల్పంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏ మాత్రం రాజీపడడం లేదు. చారిత్రాత్మక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 2014 రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరోసారి రాకూడదని వైయస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం తెలిసిందే.. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనా రాజధానిగా మారుస్తూ సిఆర్డిఏను రద్దు …
Read More »అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి హరీశ్ రావు
ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశం. యోగా జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చు. నేను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధిపేట …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ -కరోనా చికిత్సకు ఔషధం విడుదల
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు …
Read More »టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …
Read More »సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్బాబుబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్బాబు భార్యకు …
Read More »