పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం
కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్పై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …
Read More »బడి గంట మ్రోగేది అప్పుడేనా..
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2000-2004 మధ్య వాజ్పేయ్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్ చరణ్ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్ చరణ్ సేథీ లోక్సభకు ఎన్నికయ్యారు. రెండు …
Read More »తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హోంక్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, …
Read More »తేజ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్
డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కూడా అలివేలు మంగగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర …
Read More »కాళేశ్వరం డ్యాష్బోర్డు
ఒక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రణాళిక అవసరం. అదే అనేకప్రాజెక్టుల సమాహారంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు కేవలం ప్రణాళిక సరిపోదు. అందుకు భారీవ్యూహం కావాలి. అటు ప్రధాన గోదావరి.. ఇటు ప్రాణహిత.. నడుమ కడెం.. ఎప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. వర్షపాతం, వరద రాకను ముందే పసిగట్టాలి. రోజుకు 2-3 టీఎంసీల జలాలను ఎత్తిపోసే అనేకదశల్లో ఉన్న భారీమోటర్లను సక్రమంగా నిర్వహించాలి. ఎక్కడ ఏ …
Read More »హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం
హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …
Read More »కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్చానల్ క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …
Read More »మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు
మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …
Read More »