జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.
ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
Read More »బాబు అన్నంత పని చేసేశాడు
కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు
Read More »మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన …
Read More »టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..
Read More »రైతన్నకు అండగా దేశం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …
Read More »మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి షాక్ -రూ.100కోట్లు జరిమానా
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ గ్రామం ప్రశాంతి నగర్ లోని శివా విద్యానికేతన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఓటు వేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు …
Read More »