తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.
Read More »సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌరవిద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీలక …
Read More »పెన్షన్లకు కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 210 కోట్లు మాత్రమే
ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ డబ్బును 6 లక్షల మందికే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్ుభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నదన్నారు. ఆసరా …
Read More »చారిత్రాత్మకంగా యాదాద్రి
యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మకంగా జరుగుతున్నదని, ఈ నిర్మాణం చేపట్టిన సీఎం కెసిఆర్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కరోనా కష్ట కాలంలోనూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అద్దంపట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చిరాయువుగా …
Read More »ఫలించిన ‘సోషల్’ వ్యూహం!
ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గోడరాతలు, కరపత్రాలు, పోస్టర్లు కనిపించేవి. కానీ ఇప్పుడంతా ‘నెట్టింట’ ప్రచారమే హోరెత్తుతున్నది. వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు.. ఎదురుదాడులు.. అంతా సోషల్ మీడియాలోనే. తాజాగా హోరాహోరీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషించింది. బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే సోషల్మీడియాను విరివిగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నది. ప్రత్యర్థులపై దాడికి, ఆరోపణలకు, విమర్శలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నది. …
Read More »నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ …
Read More »నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47 కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Read More »హైదరాబాద్లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ …
Read More »తెలంగాణలో త్వరలోనే సమగ్ర భూ సర్వే
త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వే జరపాలని ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయిచింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లు అందించనున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంత …
Read More »