జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ …
Read More »భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే Kp కు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని …
Read More »కాల్వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాల్అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్లు …
Read More »MLA Kpను కలిసిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ సభ్యులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …
Read More »తక్కువ అద్దెకే రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు
తెలంగాణలో రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతి గ్రామీణ మండలంలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 536 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో సీహెచ్సీలను ఏర్పాటుచేశారు. మిగిలిన 405 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున సీహెచ్సీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క మండలానికి గరిష్ఠంగా రూ.30 …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త-త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు
తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను, మొబైల్ యాప్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ …
Read More »టీ – డయాగ్నోస్టిక్ హబ్ను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్ను కూడా మంత్రి ఆవిష్కరించారు. వైద్య పరీక్షల వివరాలను మొబైల్ యాప్లోనే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం …
Read More »“వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు కాసం బ్రదర్స్ అధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిపరిశీలించారు. నిర్వాహకులు ఓం నమః శివాయ ను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. మరింతగా ప్రజలకు చేరువై, మంచిగా …
Read More »కడారి అఖిల్ కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో నివాసముంటున్న మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మ ల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. గత కొద్ది కాలంగా అక్కడే సెటిల్ అయ్యారు. అయితే, 5 రోజుల క్రితం జెర్మనీ లోనే అఫీస్ పని పై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు …
Read More »ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గానికి మంత్రి అజయ్ శుభాకాంక్షలు
ఖమ్మం నగరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో రెండో మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అండదండలు, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో …
Read More »