తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్… తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా …
Read More »టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ …
Read More »తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More »కొత్త టాకీసులో పాత సినిమాలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ …
Read More »తెలంగాణలో కాంగ్రెస్ కొత్త డ్రామాలు
పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ చేయరా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా ఆలోచించారా అని రాహుల్ …
Read More »కైటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ …
Read More »రాజాసింగ్ జీ జర సునో అంటూ నవ్వులు పూయించిన మంత్రి హరీశ్రావు -Video Viral
కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్రావు ఆప్యాయంగా పలుకరించి.. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఓ రోగి తల్లి చెప్పిన మాటలు విన్న హరీశ్రావు.. తన పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను అప్రమత్తం చేశాడు. వైద్య సేవలపై ఆమె మాటలు విన్న మీరు.. ఇప్పటికైనా మా గురించి అసెంబ్లీలో …
Read More »పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోచింగ్ కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు …
Read More »కేంద్రంపై మరోసారి మండిపడ్డ మంత్రి కేటీఆర్
ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎన్పీఏ((పనికిరాని ఆస్తి- నాన్ పర్ఫార్మింగ్ అసెట్) గవర్నమెంట్లో భారతదేశ ఎకానమీని నాశనమైందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్లలో అత్యధికంగా నిరుద్యోగ …
Read More »మంత్రి హారీష్ రావుపై రేవంత్ ఫైర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” మంత్రి హరీష్ రావుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయీ, అర్హత లేదని అన్నారు. నిన్న పెద్దపల్లిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు …
Read More »