రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే …
Read More »కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్జీ గ్యాస్ లైన్ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More »కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »మేం వద్దంటున్నామా? దమ్ముంటే అమలు చేయండి: బీజేపీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …
Read More »ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ.. ఎక్కడంటే..!
కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి మంత్రులు, …
Read More »అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి గంగుల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ …
Read More »మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్
దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …
Read More »అంబేద్కర్కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Read More »అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పాలన
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …
Read More »డ్రగ్స్ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్లోని ఓ పబ్పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …
Read More »