తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 734 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »తెలంగాణలో వ్యవసాయ రంగానికి లాక్డౌన్ మినహాయింపు
తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు. FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.
Read More »తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు వీటికే…
తెలంగాణలో రేపటి నుండి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : – వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. – …
Read More »తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు
ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …
Read More »ఈ నెల 7న పుర మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …
Read More »ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’
ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …
Read More »ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More »కరోనాను జయించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన RT-PCR టెస్టులో సీఎంకు కరోనా నెగిటివ్ రాగా.. ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల సీఎంకు నిర్వహించిన RT-PCR టెస్టులో ఫలితం వెలువడకపోగా, తాజాగా మరోసారి టెస్టు చేశారు. కాగా ఏప్రిల్ 19న కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.
Read More »అచ్చంపేటలో ఖాతా తెరిచిన కారు..
అచ్చంపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 13, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. 4 వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు-షాకింగ్
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీగా మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 15వ రౌండ్ ముగిసే సరికి 9,914 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు …
Read More »