తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇండ్లలో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటంవల్ల కరోనా మహమ్మారి మరింత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడిలో తమ వంతు …
Read More »తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీ..
తెలంగాణ రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరికి ట్రాన్స్ఫర్ చేసింది. మేడ్చల్ అదనపు కలెక్టర్గా ఉన్న కే విద్యాసాగర్ను బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్ను మెదక్, మోహన్ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ పీ.రాంబాబును నిర్మల్కు బదిలీ …
Read More »జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ర్టంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. సెక్రటరీల పట్ల మరోసారి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ జీతాలు ఇస్తామన్నారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కడుపులు నింపినోళ్లం.. కడుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హరితహారంలో నాటిన …
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శాసనసభ వేదికగా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్రకటించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లాక్డౌన్ అనేది పెట్టం. పరిశ్రమల మూసివేత ఉండదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను …
Read More »తెలంగాణలో ఆగని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం మొత్తం 70,280 పరీక్షలు నిర్వహించగా మొత్తం 431 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఈ ప్రకటనను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో అత్యధికంగా రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలోనే 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 37,రంగారెడ్డి …
Read More »మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన …
Read More »చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …
Read More »నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »