తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల …
Read More »సైకిల్ ఫర్ చేంజ్ విజేత వరంగల్
ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో వరంగల్ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై …
Read More »రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (ఆహార భద్రత కార్డు) కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆవరణంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆహారభద్రత కార్డు నిరుపేదలకు ఎంతగానో …
Read More »TRS శ్రేణులకు మంత్రి KTR పిలుపు
తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక …
Read More »థ్యాంక్యూ కేటీఆర్ అన్నయ్య-ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
తన బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చనలో లేదా గిప్ట్ ఏ స్మైల్లో భాగస్వామ్యం …
Read More »సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …
Read More »యువరైతుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు పెరగడంతో.. KTR అనే అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్త శనిగారపు అర్జున్కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. …
Read More »నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.
Read More »పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …
Read More »