Home / Tag Archives: ys jagan (page 11)

Tag Archives: ys jagan

జగన్ పై లోకేష్ విమర్షల వర్షం

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

Read More »

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన సీఎస్‌గా స‌మీర్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు.

Read More »

నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్

ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …

Read More »

తనపై వస్తోన్న వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాస్ క్లారిటీ

ఏపీకి చెందిన  మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు.  మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. …

Read More »

ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?

ఇది చదవడానికి కాస్త విడ్డూరంగా ఉన్న కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను.. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవుననే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా చెపట్టిన సర్వేలో టాప్ టెన్ లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్థానం లభించకపోవడం కూడా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇమేజ్ మసకబారుతుందని చెప్పొచ్చు.. గత సార్వత్రిక ఎన్నికలకు …

Read More »

TTD పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకు ముందు సుబ్బారెడ్డి 2019లో తొలిసారిగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఈ ఏడాది జూన్‌లో పదవీకాలం ముగిసింది. ఈ సారి వేరే వారికి చైర్మన్‌ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డికే …

Read More »

తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు

తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …

Read More »

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. ఆ తర్వాతి నుంచి ప.గో, తూ.గో జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో సా.6 గంటలకే షాపులు మూసివేయాలి. మిగతా జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 10 వరకు (షాపులు 9కే మూసివేయాలి) సడలింపులు ఇవ్వగా.. పాజిటివిటీ రేటు 5%లోపు వచ్చేంత …

Read More »

కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు-సీఎం కేసీఆర్

కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో  తెలంగాణ రాష్ట్రానికి  సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.

Read More »

పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు- సీఎం కేసీఆర్

కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat