ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించిన SEC.. ఈ నెల వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్న SEC ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి సూచించింది.
Read More »ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »సీఎం జగన్ కు మాజీ మంత్రి యనమల వార్నింగ్
ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులను సహకరించకుండా చేస్తూ వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తించాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనమని చెప్పటం సరికాదని మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత
ఏపీలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు వైకాపా తరఫున పోతుల సునీత పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. సోమవారం ఆమె మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. 18న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల …
Read More »అమ్మఒడి 15వేలు కాదు 14వేలు..ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకానికి రంగం సిద్ధం చేస్తంది. రెండో విడతలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దాదాపు 45లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈనెల 9న రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ నందు శ్రీవేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
Read More »ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read More »