తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి ..ప్ల కార్డులు ప్రదర్శించారు.
మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విరిచి గవర్నర్ మీదకు విసిరేశాడు.అయితే అది పైన ఉన్న గాంధీ బొమ్మను తాకి శాసనసమండలి చైర్మన్ స్వామీగౌడ్ ను తాకింది.ఒక్కసారిగా హెడ్ ఫోన్ స్వామీ గౌడ్ కంటికి తగలడంతో తీవ్ర గాయమైంది.
ఈ సంఘటనపై ప్రభుత్వ విప్ ,అధికార పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడు జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ రౌడీయిజాన్ని ప్రదర్శించారు.అసెంబ్లీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్యం త్రాగి సమావేశాలకు వచ్చారు అని ఆయన ఆరోపించారు ..