ప్రముఖ దర్శకుడు బాబీ దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబోలో ఓ ఫుల్ లెంగ్త్ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని, ఇక ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని టాలీవుడ్ టాక్. అక్కినేని నాగచైతన్య, దగ్గుబాటి వెంకటేష్ కాంబినేషన్లో ఇంతకు ముందు ప్రేమమ్ చిత్రం తెరకెక్కినప్పటికీ, అందులో వెంకటేష్ ఇలా కనిపించి అలా వెళ్లిపోతాడు. అయితే, ప్రస్తుతం మామా, అల్లుడు కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ చిత్ర తెరకెక్కుతుండటంతో ఇటు దగ్గుబాటి అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
see also :
నీకు ..మార్కులు కావాలంటే ముద్దులివ్వాలంటూ లెక్చరర్ ..!
ఇదిలా ఉండగా దగ్గుబాటి వెంకటేష్ ఇటీవల కాలంలో యువ హీరోలత నటించేందుకు ఆసక్తికనబరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రామ్, మహేష్బాబు, పవన్ కల్యాణ్లతో కలిసి నటించారు వెంకటేష్. అలాగే, హీరో నారా రోహిత్, దర్శకుడు తేజా కాంబోలో తెరకెక్కుతున్న ఓ సినిమాలోనూ వెంకటేష్ నటిస్తున్నాడు. అంతేకాకుండా, నాగచైతన్య, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రంలో వీరిద్దరికి జోడీగా నయన తార, సమంతలను తీసుకోవాలని చిత్ర బృందం నిర్ణయించిందట. గతంలో వెంకటేష్ – నయనతార, నాగచైతన్య – సమంత నటించిన చిత్రాలు హిట్ సాధించడంతోనే ఈ చిత్రం కూడా హిట్ లిస్ట్లో చేరడం ఖాయమనేది సినీ జనాల మాట.
see also : శ్రీరెడ్డి..ఇష్టం లేకపోతే పట్టుకెళ్లిపోయి రేప్ చేసేవాళ్లయితే లేరు..మరో నటి సంచలన వాఖ్యలు..!