ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఐదుగురు లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై వైసీపీ అనేక పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న సంగతి విదితమే.
గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైసీపీ పార్టీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడం..స్పీకర్ సభను వాయిదా వేయడం మనం చూస్తూనే ఉన్నాం .
దీంతో సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగదని భావించిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి ,వరప్రసాద్ ,అవినాష్ రెడ్డి ,మేకపాటి రామోహన్ రెడ్డి తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు.తమ రాజీనామా పత్రాలన్నీ స్పీకర్ ఫార్మట్ లో ఉండే విధంగా రాజీనామా చేశారు ..