కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియస్గా ఫైట్ చేస్తున్నట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేతలు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రజల సంక్షేమానికి ఎంతో అవసరమైన సీరియస్ అంశాలపై టీడీపీ ఎంపీలు వేసిన జోక్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు
వారు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా.. ఏపీ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంశాలపై వేసిన జోక్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమండ్రి టీడీపీ ఎంపీ అయితే, ఒక అడుగు ముందుకేసి హక్కుల సాధనలో భాగంగా చేసే దీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నానండీ.. రేపట్నుంచి నేను కూడా దీక్ష చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.