దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతున్న యాత్ర సినిమా టాలీవుడ్ “ప్రముఖుల” మనసుల్ని మాత్రం కదిలించలేకపోయింది. సినిమాని సినిమాగా సినిమాపరిశ్రమే చూడదు. “యాత్ర” సినిమాపై పరిశ్రమ నుంచీ రాని స్పందన చూస్తే అలాగే ఉంది. యాత్ర సినిమాని అభినందిస్తే, జగన్ పార్టీ అనునుకుంటారేమో లేదా చంద్రబాబు ఏమనుకుంటాడో అని భయం.ఒక సినిమాగా యాత్ర ఒక మంచి ప్రయత్నం
ఎన్టీఆర్-కథానాయకుడు ఇలా రిలీజైన వెంటనే అలా ట్వీట్లు వెళ్లువెత్తాయి. ఆహా.. ఓహో అంటూ ఒకటే పొగడ్తలు. అదే యాత్ర సినిమాకు వచ్చేసరికి మాత్రం అంత రెస్పాన్స్ కనిపించలేదు.నిజానికి ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా కంటే కొన్ని రెట్లు బెటర్ మూవీ యాత్ర. పార్టీలకు అతీతంగా, జానర్ కు భిన్నంగా, వయసు తేడాలు లేకుండా యూత్ నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఆకర్షిస్తోంది ఈ సినిమా. టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఇది కచ్చితంగా ఆకర్షించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్లందరికీ మనసులో భయం. యాత్ర సినిమాను మెచ్చుకుంటే ఎక్కడ చంద్రబాబుకు కోపం వస్తుందేమోనని చాలామందికి అనుమానం. పరిశ్రమ పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకున్నారు. తమ బాధ్యతగా యాత్ర సినిమా చూసొస్తున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో పెరిగిన ఎంతోమంది ప్రేక్షకులు యాత్ర సినిమాను చూడడం తమ బాధ్యతగా ఫీల్ అవుతున్నారు.యాత్ర సినిమాకు ఇది చాలు.
ఇప్పటికైనా టాలీవుడ్ ముందుకురావాలి. పరిశ్రమకు కులాలు, మతాలు, పార్టీలు, రంగులు లేవని గొప్పలు చెప్పుకునే ప్రముఖులు యాత్ర సినిమాను ఓ విజయంగా గుర్తించకపోయినా ఫర్వాలేదు. కనీసం ఓ మంచి ప్రయత్నంగా మెచ్చుకోవాలి.